ETV Bharat / international

చైనా నిజస్వరూపం బయటపడింది: ట్రంప్​

తూర్పు లద్దాఖ్​ గల్వాన్ లోయ వద్ద చైనా ప్రదర్శిస్తున్న దూకుడు.. వారి దురాక్రమణ వాదాన్ని తేటతెల్లం చేస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వాస్తవాధీన రేఖ వెంబడి కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలను అమెరికా నిశితంగా పరిశీలిస్తోందన్నారు.

author img

By

Published : Jul 2, 2020, 10:23 AM IST

Aggressive stance against India  confirms true nature of Chinese Communist Party: White House
చైనా నిజస్వరూపం బయటపడింది: ట్రంప్​

భారత్​ సహా చుట్టుపక్కల దేశాలపై చైనా ప్రదర్శిస్తున్న దుందుడుకు వైఖరి... కమ్యూనిస్టు పార్టీ నిజ స్వరూపాన్ని తేటతెల్లం చేస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. డ్రాగన్ సామ్రాజ్య విస్తరణవాదంతో ఇరుగుపొరుగు దేశాల భూభాగాలను ఆక్రమించుకునేందుకు​ ప్రయత్నిస్తోందని విమర్శించారు.

తూర్పు లద్దాఖ్​లో భారత్​- చైనా మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలను అమెరికా నిశితంగా పరిశీలిస్తోందని శ్వేతసౌధం తెలిపింది. ఇరుదేశాలు సరిహద్దు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నదే అమెరికా అభిమతమని శ్వేతసౌధం ప్రెస్​ సెక్రటరీ అన్నారు.

"తూర్పు లద్దాఖ్​లో చైనా దూకుడు... వారి దురాక్రమణ వాదాన్ని బట్టబయలు చేస్తోందని.. ఇదే చైనా కమ్యూనిస్ట్ పార్టీ నిజస్వరూపమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు."

- కైలీ మెక్​ఎనానీ, శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ

సరిహద్దు ఉద్రిక్తతలు

జూన్​ 15న గల్వాన్ లోయ వద్ద ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ జవాన్లు అమరులయ్యారు. చైనా వైపు కూడా భారీగా ప్రాణనష్టం జరిగింది. దీనితో గత రెండు వారాలుగా తూర్పు లద్దాఖ్ గల్వాన్ లోయ వద్ద భారత్​- చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సమస్య పరిష్కారం దిశగా ఇరుదేశాలు దౌత్య, సైనిక స్థాయిలో చర్చలు జరుపుతున్నాయి.

ఇంతకు ముందు అమెరికా కాంగ్రెస్ సభ్యులు కూడా... వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దూకుడుపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: రెమిడెసివిర్ ఔషధం‌ మొత్తం అమెరికాకే..!

భారత్​ సహా చుట్టుపక్కల దేశాలపై చైనా ప్రదర్శిస్తున్న దుందుడుకు వైఖరి... కమ్యూనిస్టు పార్టీ నిజ స్వరూపాన్ని తేటతెల్లం చేస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. డ్రాగన్ సామ్రాజ్య విస్తరణవాదంతో ఇరుగుపొరుగు దేశాల భూభాగాలను ఆక్రమించుకునేందుకు​ ప్రయత్నిస్తోందని విమర్శించారు.

తూర్పు లద్దాఖ్​లో భారత్​- చైనా మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలను అమెరికా నిశితంగా పరిశీలిస్తోందని శ్వేతసౌధం తెలిపింది. ఇరుదేశాలు సరిహద్దు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నదే అమెరికా అభిమతమని శ్వేతసౌధం ప్రెస్​ సెక్రటరీ అన్నారు.

"తూర్పు లద్దాఖ్​లో చైనా దూకుడు... వారి దురాక్రమణ వాదాన్ని బట్టబయలు చేస్తోందని.. ఇదే చైనా కమ్యూనిస్ట్ పార్టీ నిజస్వరూపమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు."

- కైలీ మెక్​ఎనానీ, శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ

సరిహద్దు ఉద్రిక్తతలు

జూన్​ 15న గల్వాన్ లోయ వద్ద ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ జవాన్లు అమరులయ్యారు. చైనా వైపు కూడా భారీగా ప్రాణనష్టం జరిగింది. దీనితో గత రెండు వారాలుగా తూర్పు లద్దాఖ్ గల్వాన్ లోయ వద్ద భారత్​- చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సమస్య పరిష్కారం దిశగా ఇరుదేశాలు దౌత్య, సైనిక స్థాయిలో చర్చలు జరుపుతున్నాయి.

ఇంతకు ముందు అమెరికా కాంగ్రెస్ సభ్యులు కూడా... వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దూకుడుపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: రెమిడెసివిర్ ఔషధం‌ మొత్తం అమెరికాకే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.